ATP: ఈ నెల 16న అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సుజ్లాన్ ఎనర్జీ, కియా, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హతలతో 18–35 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఆసక్తిగల వారు naipunyam.ap.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో 16న ఉద్యోగ మేళా


