SKLM: మందస, కుంటికోట పరిసర గ్రామాల్లో కోతుల బెడదకు అడ్డుకట్ట వేసి, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ జనసేన నాయకులు శుక్రవారం కాశీబుగ్గ రేంజ్ అటవీ అధికారికి వినతిపత్రం అందజేశారు. కోతులు గుంపులుగా జనావాసాల్లోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఇళ్లలోని ఆహారాన్ని ఎత్తుకెళ్లడంతో పాటు పంటలు,పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కోతుల బెడద నుంచి కాపాడాలి'


