హైదరాబాద్: 28°C
తెలంగాణ

బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసిన సబ్‌కలెక్టర్

NRML: భైంసా పట్టణంలో పొలాల అమావాస్య వేడుకలను రైతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రైతులు తమ బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి హనుమాన్ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. కిసాన్‌ గల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో భైంసా సబ్‌కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌కుమార్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ దత్తాత్రి, మార్కెట్‌ ఛైర్మన్‌, తదితరులు పాల్గొని బసవన్నలకు ప్రత్యేక పూజలు చేశారు.