హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిరిండియా విమానం దారి మళ్లింపు

ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని స్విట్జర్‌ల్యాండ్‌లోని జ్యూరిచ్‌కు మళ్లించినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది. విమానంలో 290 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపింది. హీత్రూ విమానాశ్రయంలో సాంకేతిక సమస్యను పరిష్కరించే వరకు వారంతా విమానంలోనే ఉండే అవకాశం ఉందని చెప్పింది. గతంలోనూ బ్రిటన్ విమానయాన నెట్‌వర్క్‌లో ఇటువంటి సమస్యలు తలెత్తాయి.