KRNL: కర్నూలు నాలుగో పట్టణ PS పరిధిలో వరుస నేరాలకు పాల్పడుతున్న ఐదుగురిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రామాంజనేయులు, తులసికుమార్, వడ్డే రేవంత్, శివకుమార్, ఇమ్రాన్ఖాన్లను జిల్లా నుంచి బహిష్కరిస్తూ కలెక్టర్ ఏ. సిరి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై హత్య, దోపిడీ, హత్యాయత్నం తదితర పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఐదుగురిపై జిల్లా బహిష్కరణ


