హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు బాలల బీమా ప్రీమియం జమ

ATP: అనంతపురం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఓ.ఆనంద్‌కు బాలల బీమా ప్రీమియం జమ రసీదును మంగళవారం అందజేశారు. కంబదూరు మండలంలో 1–10వ తరగతి చదువుతున్న 4,974 మంది విద్యార్థులకు రూ.24,870 ప్రీమియం బీమా ఖాతాలో జమ చేశారు. సమగ్ర శిక్ష ఇన్‌ఛార్జ్ ఐఈడీ కోఆర్డినేటర్ ఫణిరాజు, ఎంఈఓ-1 ఉమాపతి, విలేకరి మల్లేసు రసీదును సమర్పించారు.