హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కంది, చిరుధాన్యాలు సాగు చేయాలి'

PLD: నకరికల్లు(M) కుంకలగుంటలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఏఓ కే. దేవదాస్ మాట్లాడుతూ.. ఎల్‌నినో వల్ల కంది, మినుము, కొర్రలు, రాగులు వంటి పంటలు పండించడమే మేలన్నారు. ప్రకృతి పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకోవాలని సూచించారు. పథకాల లబ్ధికి ఏపీ ఎఫ్‌ఆర్ పోర్టల్‌లో రైతు గుర్తింపు సంఖ్య నమోదు తప్పనిసరని తెలిపారు.