BPT: కర్లపాలెం మండలంలోని సచివాలయాలను ఎంపీడీవో శ్రీనివాసరావు మంగళవారం సందర్శించారు. పింఛన్లను ఆన్లైన్ చేయడానికి సిబ్బంది కొరత లేకుండా చూస్తున్నామన్నారు. డిజిటల్ అసిస్టెంట్లు పెన్షన్లను ఆన్లైన్ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు తప్పక కలిగి ఉండాలని లబ్ధిదారులకు సూచించారు. సందేహాలుంటే స్వర్ణ వార్డులను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్ల ఆన్లైన్ ప్రక్రియ సమీక్షించిన ఎంపీడీవో


