హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడల్లో సత్తా చాటిన మహిళా కానిస్టేబుల్

E.G: సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు విజయవాడలో జరిగిన తొలి రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో రాజమండ్రి మహిళా పోలీస్ స్టేషన్‌కు  చెందిన కానిస్టేబుల్ ఆర్. సంధ్య ప్రతిభ కనబరిచారు. హ్యాండ్ బాల్‌లో బంగారు పతకం, వాలీబాల్‌లో వెండి పతకం, ఆర్మ్ రెజ్లింగ్లో తృతీయ స్థానం సాధించి ఆమె కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను స్టేషన్ సిబ్బంది అభినందించారు.