హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLC తాతా మధుపై చర్యలు తీసుకోవాలి: పసుల చంటి

ADB: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యవస్థను అవమానించేలా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి మండిపడ్డారు. సోమవారం బోథ్‌ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశమై మాట్లాడారు. స్పీకర్‌ను దూషించిన మధును శాసనమండలి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.