హైదరాబాద్: 28°C
క్రీడలు

సఫారీలతో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన

ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న మార్నస్ లబూషేన్‌కు సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. స్వదేశంలో బంగ్లాదేశ్‌పై విఫలమైనా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. వేటు వేయాలనే డిమాండ్లు ఉన్నప్పటికీ అతడిపై నమ్మకం ఉంచారు. ఇదే జట్టులో ఓపెనర్‌గా మాథ్యూ రెన్‌షాకు చోటు దక్కగా, టీ20ల్లో రాణిస్తున్న కూపర్ కొన్నొల్లీకి కూడా అవకాశం లభించింది.