హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తాతా మధును సస్పెండ్ చేయాలి'

VKB: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తాతా మధును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.