హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.50 వేల వేతనంతో జాబ్ మేళాకు సర్వం సిద్ధం

సత్యసాయి: ధర్మవరంలోని CNB ఫంక్షన్ హాల్‌లో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇంఛార్జ్ హరీష్ బాబు తెలిపారు. 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని, రూ.10 వేల నుంచి రూ. 50 వేల వరకు వేతనాలతో ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18-35 ఏళ్ల యువత సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని కోరారు.