హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పీజీఆర్‌ఎస్‌ అర్జీలకు సత్వర పరిష్కారం'

GNTR: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ సీ.ఎం. సాయికాంత్‌ వర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని శంకరన్‌ హాల్లో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.