MLG: కృత్రిమ రంగులు, రసాయనాలతో తయారు చేసిన గణేష్ విగ్రహాల వల్ల జలవనరులు కలుషితమవుతున్నందున మట్టివిగ్రహాలను పూజించాలని ములుగు కలెక్టర్ సహదేవరావు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మట్టిగణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణమండలి ఆధ్వర్యంలో 8అంగుళాల మట్టి గణపతులను అందించి పర్యావరణంపై అవగాహన కల్పిస్తామన్నారు.
తెలంగాణ
'మట్టి గణేష్లను పూజించి పర్యావరణాన్ని కాపాడాలి'


