హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెరిగిన నిత్యవసర ధరలను తగ్గించాలి'

ATP: గుంతకల్ మండల తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా సోమవారం ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మహిళా సంఘం జిల్లా నాయకురాలు జ్యోతి మాట్లాడుతూ .. పెరిగిన నిత్యవసర ధరలతో మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన నిత్యవసర ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.