హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దరఖాస్తుదారులు దళారులను నమ్మవద్దు: ఎమ్మెల్యే

కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో దరఖాస్తుదారులు ఎవరూ కూడా దళారులను నమ్మవద్దని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. అర్హులైన దరఖాస్తుదారులు తమ వద్ధ అన్ని ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రైస్ కార్డు జిరాక్సులతో నేరుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో, గ్రామ సచివాలయ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.