KRNL: దేవనకొండ పీహెచ్సీలో సిబ్బంది కొరతను పరిష్కరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇవాళ గ్రామ అభివృద్ధి కమిటీ కోరింది. అవసరమైన మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేసారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య బీమా, రక్షణ పరికరాలు కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు కమిటీ నేతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజారోగ్య సేవలు మెరుగుపరచాలి'


