హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలకు త్రాగునీరు అందించడమే తమ లక్ష్యం'

NDL: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు త్రాగునీరు అందించడమే తమ లక్ష్యమని సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఒక ప్రకటనలో వెల్లడించారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి తెలుగు గంగ కాలువ ద్వారా నీటిని దిగువకు విడుదల చేశామని ఆమె అన్నారు. ముందుగా ప్రజలకు త్రాగునీరు అందించిన తర్వాత రైతుల కోసం చెరువులను నీటితో నింపుతామని ఎమ్మెల్యే అఖిలప్రియ పేర్కొన్నారు.