భారత్, జపాన్ మధ్య సెప్టెంబర్ 22న జరగనున్న చారిత్రక టీ20 మ్యాచ్ క్రికెట్ను తూర్పు ఆసియాకు విస్తరించడంలో కీలక అడుగు అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నాడు. ఇరు దేశాల దౌత్య సంబంధాల 75 ఏళ్ల వేడుకల్లో భాగంగా జపాన్లోని సానో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆసియా క్రీడల సన్నాహకంగానూ ఈ పోరు ఉపయోగపడనుంది.
క్రీడలు
'భారత్-జపాన్ మ్యాచ్ ఓ కీలక అడుగు'


