హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రహదారులపై గుంతలు పూడ్చాలి'

SRCL: బోయిన్‌పల్లి మండలం రత్నంపేట గ్రామంలో రహదారులపై గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని CPM మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ ఈ రోజు ఆరోపించారు. సమస్య పరిష్కారంలో గ్రామపంచాయతీ పాలకవర్గం విఫలమైందని, కార్యదర్శిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎంపీడీవో స్పందించి గుంతల మరమ్మతులు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.