హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

ATP: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ సత్తా చాటాలని ఆ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన యువజన విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.