హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు యధావిధిగా 'PGRS': కలెక్టర్

W.G: భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరగనుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజలు అధికారులను కలిసి నేరుగా అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. దూర ప్రాంతాల ప్రజలు కలెక్టరేటు రాకుండానే 1100 టోల్ ఫ్రీ నం ద్వారా పిర్యాదు చేయవచ్చన్నారు.