బాపట్ల ఆర్డీవో హరి కుమార్ PC&PNDT చట్టం అమలుపై కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సినిమా హాళ్లలో స్లైడ్స్ ప్రదర్శించాలని, ప్రతి నెల 30న గ్రామ, మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. యువతీ యువకులకు విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా సమస్యలను అరికట్టవచ్చని ఎన్జీవో ప్రతినిధులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
PC&PNDT చట్టం అమలుపై ఆర్డీవో సమీక్ష


