హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సరీ రంగ అభివృద్ధికి సహకరించాలని వినతి

E.G: సర్ ఆర్ధర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం రాజమహేంద్రవరంలో ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసింది. నర్సరీ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం, మూడు ఫేజ్ విద్యుత్, సోలార్ సబ్సిడీ, ఎర్రమట్టి అనుమతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నర్సరీ రైతుల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.