హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ పాలన ప్రజా పీడన: టీబీజీకేఎస్‌

BDK: మణుగూరు మండలం ప్రకాశం ఖని ఓసీ-2 వద్ద శనివారం టీబీజీకేఎస్‌ గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలో సింగరేణి పురోగతికి బదులు విధ్వంసం కనిపిస్తోందని ఆరోపించారు.సింగరేణికి రావాల్సిన రూ.60 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని,బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించి ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశరు.