BPT: ఈనెల 14న వినాయక చవితి సందర్భంగా అద్దంకి మండలంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాలని సీఐ సుబ్బరాజు తెలిపారు. విగ్రహం ఎత్తు, స్థలం, నిమజ్జన తేదీ, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భద్రత దృష్ట్యా ప్రతీ మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.
వార్తలు
'వినాయక మండపాలకు అనుమతులు తప్పనిసరి'


