హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

కోనసీమ: ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శనివారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, తక్షణం పరిష్కరించగల అంశాలపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.