హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ఎక్స్‌పోజర్‌ విజిట్‌'

ADB: ఆదిలాబాద్‌లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు చేపట్టిన హైదరాబాద్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌ను కలెక్టర్ రాజర్షిషా జెండా ఊపి ప్రారంభించారు. 80 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడిన బస్సులు బయలుదేరాయి. ఈ పర్యటన విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో మాధవి పాల్గొన్నారు.