హైదరాబాద్: 28°C
తెలంగాణ

'MRP ధరలకు ఎరువులు విక్రయించాలి'

PDPL: ప్రభుత్వం నిర్ణయించిన MRP ధరలకే ఎరువులు విక్రయించాలని ధర్మారం మండల వ్యవసాయ అధికారి ప్రకాష్ డీలర్లకు సూచించారు. ఈ మేరకు ఆయన ఇవాళ రైతు వేదికలో డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఎరువులతో పాటు ఇతర వస్తువులు కొనాలని రైతులకు లింకు పెట్టకూడదని తెలిపారు. స్టాక్ ఉన్నంతవరకు బుక్ చేసుకున్న రైతులకు ఎరువులు అందించాలని ఆయన పేర్కొన్నారు.