హైదరాబాద్: 28°C
క్రీడలు

షమీలో ఇంకా కసి తగ్గలేదు: ఇషాన్ కిషన్

టీమిండియాలో చోటు కోల్పోయిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. షమీ ప్రదర్శనపై ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ స్పందించాడు. ఆటగాడి రాణించే తీరు ముఖ్యం కానీ వయసు కాదని అన్నాడు. షమీని మళ్లీ టీమిండియాకు ఎంపిక చేసే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డాడు.