హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొంగులేటికి మాధవరం కృష్ణారావు సవాల్

MDCL: ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లాటరీలో కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలకే 480 ఇళ్లు కేటాయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. మూసాపేట్ డివిజన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.