హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం: ఎస్పీ

NRPT: లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని నారాయణపేట ఎస్పీ వినీత్‌ శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న కోర్టులో జరిగే లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిష్కారమయ్యే కేసులను పోలీసులు గుర్తించి కక్షిదారులకు అవగాహన కల్పించాలన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని పేర్కొన్నారు.