హైదరాబాద్: 28°C
క్రీడలు

స్మృతి మంధానను ఊరిస్తున్న అరుదైన రికార్డ్

భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య కాసేపట్లో హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు స్టార్ బ్యాటర్ స్మృతి మంధానను ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది. స్మృతి మరో 78 పరుగులు చేస్తే.. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది. ఈ రికార్డు కివీస్ ప్లేయర్ సూజీ బేట్స్ (4,758) పేరిట ఉండగా, స్మృతి 4,681 పరుగులు చేసింది.