PLD: పెదకూరపాడు ఆర్టీసీ బస్టాండు వీధికుక్కలకు షెల్టర్గా మారిందని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎండ తీవ్రతకు బస్టాండ్ ఆవరణలో కుక్కలు విశ్రాంతి తీసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా వృద్ధులు, భిక్షాటకులు వచ్చినప్పుడు కుక్కలు మొరుగుతూ.. భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వీధి శునకాలకు షెల్టర్గా మారిన ఆర్టీసీ బస్టాండ్


