హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్టీ లైన్ దాటితే వేటు తప్పదు: మహేష్ గౌడ్

MDCL: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరమని అన్నారు. అయితే ఆమె పలుమార్లు పార్టీ లైన్ దాటి మాట్లాడారని తెలిపారు. కూతురు చేసిన వ్యాఖ్యలను సురేఖ ఖండించకపోవడాన్ని ఏఐసీసీ తీవ్రంగా పరిగణించిందన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.