KMM: బాకీ కార్డు ద్వారా మహిళలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని BRS మధిర నియోజకవర్గ ఇంఛార్జ్ లింగాల కమల్ రాజు అన్నారు. శుక్రవారం ఎర్రుపాలెంలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైన ప్రభుత్వం ప్రజలను మోసం చేయకుండా హామీలు అమలు చేయాలని, నిర్లక్ష్యం చేస్తే పోరాటలకు సిద్ధం అవుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు: BRS


