MDCL: శుభకార్యాల్లో ట్రాన్స్జెండర్ వ్యక్తుల వేధింపులు పెరుగుతున్నాయంటూ హైదరాబాద్ చింతల్కు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. గృహప్రవేశ వేడుకకు వచ్చిన కొందరు రూ.50 వేల డబ్బు డిమాండ్ చేసి రచ్చ చేశారని ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యుల ఆనందం ఆవిరైందని వాపోయారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ
గృహప్రవేశంలో హిజ్రాల రచ్చ.. మహిళ ఆవేదన


