హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిరీష కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి

HYD: నగరంలో నర్సు శిరీష హత్య నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెంలోని ఆమె స్వగ్రామానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను అందజేశారు. శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.