హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంక క్రికెట్ జట్టుకు భారీ షాక్

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ కుశాల్ మెండిస్ తొడ కండరాల గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే, బౌలర్ ఫెర్నాండో వెన్ను గాయంతో సిరీస్ నుంచి వైదొలిగాడు. దీంతో శ్రీలంక జట్టును చరిత్ అసలంక లీడ్ చేయనున్నాడు. ఈ సిరీస్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.