ప్రకాశం: శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని జరుగుమల్లి(M) కామేపల్లిలో శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారిని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ అర్చకులు రంగురంగుల పూలమాలలు, విద్యుత్ దీపాల కాంతులతో అమ్మవారి రూపానికి అద్భుతమైన శోభను చేకూర్చారు. ముఖ్యంగా పూలతో చేసిన విశేష అలంకరణ భక్తిభావం ఉట్టిపడేలా చేస్తూ నయనానందకరంగా దర్శనమిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
పోలేరమ్మ గుళ్లో శ్రావణ మాస పూజలు


