హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం!

వయసుకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన భారత అండర్‌-19 క్రికెటర్, బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. అతడిపై రెండేళ్ల పాటు నిషేధం విధించినట్లు సమాచారం. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ ఆదేశాలను పాటించాలని బోర్డు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.