హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి గణపతులనే ప్రతిష్టించండి: HMDA

HYD: రాబోయే వినాయక చవితి సందర్భంగా పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలని HMDA చీఫ్‌ ఇంజనీర్‌ పరంజ్యోతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, రసాయన రంగుల విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్‌, చెరువులు కాలుష్యానికి గురవుతున్నాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని కోరారు.