హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డీజేలకు అనుమతి లేదు.. నిర్వహిస్తే కేసులు'

KMR: డీజే నిర్వాహకులతో ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌డీపీఓ శ్రీనివాసరావు సమావేశమయ్యారు. డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని, నిర్వహిస్తే డీజేలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల సూచనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు రాజు, భార్గవ్, దీపక్ పాల్గొన్నారు.