హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలి: సీఎస్‌

HYD: ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్‌ సంజయ్‌ జాజు ఆదేశించారు. సచివాలయంలో వికాస్‌ రాజ్‌, నవీన్‌ మిట్టల్‌ తదితర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు త్వరగా సమాధానాలు అందించేందుకు ప్రతి శాఖలో నోడల్‌ అధికారిని నియమించాలని సూచించారు.