హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోడుప్పల్‌లో కాంగ్రెస్‌ భారీ బైక్‌ ర్యాలీ

MDCL: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించాయి. డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌, మాజీ మేయర్‌ తోటకూర అజయ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ బోడుప్పల్‌ కమాన్‌ వద్ద ముగిసింది. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.