PLD: నరసరావుపేట భువనచంద్ర టౌన్హాల్లో సెప్టెంబర్ 5న ఉదయం 10 గంటలకు గురుపూజోత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. కలెక్టర్ కృతికా శుక్ల అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
‘ఈనెల 5న గురుపూజోత్సవం’


