MDCL: కూకట్పల్లి పరిధిలోని మూసాపేట చిత్తారమ్మ ఆలయం వద్ద రోడ్డు విస్తరణ పనులతో ఉపాధి కోల్పోతున్నామని స్థానిక తోపుడు బండ్ల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ను కలిసి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని వినతిపత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని బండి రమేష్ హామీ ఇచ్చారు.
తెలంగాణ
రోడ్డు విస్తరణతో ఉపాధి కోల్పోయిన వ్యాపారులు


