హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్

ధోనీ అభిమానులకు CSK మాజీ ప్లేయర్ బద్రినాథ్ గుడ్‌న్యూస్ చెప్పాడు. IPL-2027 సీజన్‌లో ధోనీ తప్పకుండా ఆడతాడని వెల్లడించాడు. 'ధోనీ నాతో వ్యక్తిగతంగా ఓ మాట చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాదు.. ఫుల్‌టైమ్ వికెట్ కీపర్‌గానే ఆడతానని అన్నాడు. ఒకవేళ ధోనీ బరిలోకి దిగితే CSKకు ప్రయోజనమే. కానీ, ధోనీ శరీరం అంత సమయం సహకరిస్తుందా? అనేది అనుమానం' అని పేర్కొన్నాడు.