RR: ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం ప్రభుత్వ గిరిజన గురుకులంలో ఇంటర్ విద్యార్థిని మూడవత్ అశ్విని బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. షాద్నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సీఐ సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య


